WTC ఫైనల్ 2023: కష్టాల్లో టీం ఇండియా… గెలుపు కష్టమే ఇక !

-

ఇంగ్లాండ్ లోని లార్డ్స్ వేదికగా ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇండియా మొదటి ఇన్నింగ్స్ ను 469 పరుగుల లోటుతో స్టార్ట్ చేసిన రోహిత్ శర్మ మరియు శుబ్ మాన్ గిల్ లు ఫాస్ట్ గా ఆడుతూ తొందరగా ఇద్దరి వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత వెంట వెంటనే పుజారా మరియు కోహ్లీ ల వికెట్ లను కూడా కోల్పయి తీవ్రమైన కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ , గ్రీన్, బొలాండ్ మరియు స్టార్క్ లు తలో వికెట్ తీసుకున్నారు. గత సంవత్సరం మిస్ అయిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఈసారి అయిన గెలుస్తుందని ఎన్నో ఆశలను పెట్టుకున్న టీం ఇండియా యాజమాన్యం మరియు అభిమానులు ఈ తరహా ఆటతీరును చూస్తుంటే చాలా బాధలో ఉంటారు.

ప్రస్తుతం ఇండియా నాలుగు వికెట్లకు 87 పరుగులు చేసి చాల ఇబ్బందుల్లో ఉంది. మరి ప్రస్తుతం క్రీజులో ఉన్న రహానే మరియు జడేజాలు ఇండియాను ఒడ్డున పడేస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news