అన్ని ఫార్మాట్లలోను నెంబర్ వన్ స్థానంలో భారత్

-

ఐసీసీ తాజాగా వెల్లడించిన ర్యాంకుల్లో మూడు ఫార్మాట్లలో నంబర్ -1 స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇది వరకు టెస్టుల్లో రెండో ర్యాంకులో ఉన్న ఇండియా…5 టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ ను చిత్తు చేయడంతో టెస్టుల్లోనూ నంబర్ -1 ర్యాంకును దక్కించుకుంది.టెస్టుల్లో 112, వన్డేల్లో 121, టీ20ల్లో 266 పాయింట్లతో టీమిండియా టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది .

ఇక సెకండ్ ప్లేస్ లో ఆస్ట్రేలియా ఉండగా…ఇంగ్లండ్ రెడ్-బాల్ ఫార్మాట్‌లో థర్డ్ ప్లేస్ లో ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఇండియా కూడా 6 విజయాలతో 68.51 పాయింట్ల శాతంతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. డబ్ల్యూటీసీ సిరీస్‌లో ఇండియాకు ఇంకా ఐదు టెస్టు మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి.ఈ సంవత్సరం స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లతో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో ఇండియా భారీ తేడాతో గెలిస్తే ఫైనల్ చేరే అవకాశం ఉంది.కాగా, ధర్మశాల వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదో టెస్టులో నిన్న ఇంగ్లండ్ పై ఇన్నింగ్స్ 64 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది.దీంతో కెప్టెన్ రోహిత్ సారథ్యంలోని టీమిండియా టెస్టు సిరీస్ ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news