2047 వరకు ప్రపంచంలోనే భారత్ నెంబర్ వన్ గా నిలుస్తుంది : సీఎం చంద్రబాబు

-

2047 వరకు ప్రపంచంలోనే భారత్ నెంబర్ వన్ గా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్  సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీసిటీలోని బిజినెస్ సెంటర్ లలో పలు కంపెనీల సీఈవోలతో జరిగిన సమావేశంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపై సీఎం మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు.

ఈ పరిశ్రమల ద్వారా దాదాపు 2740 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్టు తెలిపారు చంద్రబాబు. రూ.900 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్టు వెల్లడించారు. 2047 వరకు ప్రపంచంలోనే భారత్ నెంబర్ వన్ గా నిలుస్తుంది. పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించానని తెలిపారు. శ్రీ సిటీలోని 8 వేల ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి. గతంలో పీపీపీ విధానంలో హైటెక్ సిటీ నిర్మాణం చేపట్టాం. ప్రభుత్వానికి పరిశ్రమల ద్వారానే అధిక ఆదాయం సమకూరుతుందని తెలిపారు. శ్రీ సిటీలో 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 

Read more RELATED
Recommended to you

Latest news