Womens World Cup 2022 : 155 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్‌ విక్టరీ

-

ఇవాళ ఇండియా, వెస్టిండీస్‌ ఉమెన్స్‌ జట్ల మధ్య వరల్డ్‌ కప్‌ లీగ్‌ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. హామీల్టన్‌ వేదికగా జరిగిన ఈ వన్డే మ్యాచ్‌ లో.. టీమిండియా ఏకంగా 155 పరుగుల తేడాతో గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. దీంతో ఐసీసీ వరల్డ్‌ కప్‌ లో రెండు మ్యాచులు తన ఖాతాలో వేసుకుంది టీమిండియా. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా…. 50 ఓవరల్లో ఏకంగా.. 8 వికెట్లు కోల్పోయి… 317 పరుగులు చేసి.. దుమ్ములేపింది.

టీమిండియా ఓపెనర్‌ మందనా… 119 బంతుల్లో 123 పరుగులు చేసి… టీమిండియాకు భారీ స్కోర్‌ అందించింది. అటు హర్మీత్‌ కౌర్‌ కూడా సెంచరీ బాదడంతో… 318 పరుగుల భారీ టార్గెట్‌ ను వెస్టీండీస్‌ జట్టు ముందు ఉంచగలిగింది. భారీ టార్గెట్‌ ఛేదనకు దిగిన వెస్టిండీస్‌ జట్టు 40.3 ఓవర్లలో 162 కు ఆలౌట్‌ అయింది. దీంతో… టీమిండియా 155 పరుగుల తేడాతో విజయం అందుకుంది. కాగా…. ఐసీసీ వరల్డ్‌ కప్‌ మొదటి మ్యాచ్‌ లో పాకిస్తాన్‌ జట్టు పై ఇండియా గెలిచిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news