India vs Sri Lanka : బోణి కొట్టిన భారత్‌.. లంకతో తొలి టీ20లో టీమిండియా సూపర్‌ విక్టరీ

-

కొత్త సంవత్సరంలో టీమిండియా మంచి శకునం ఎదురైంది. శ్రీలంకతో మూడు టీ 20ల సిరీస్ లో టీం ఇండియా శుభారంభం చేసింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో యువ ఆటగాళ్లతో సరికొత్తగా మారిన టి20 జట్టు మంగళవారం తొలి టీ20 లో రెండు పరుగుల తేడాతో లంకను ఓడించింది.

మొదట దీపక్ హుడా, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ రాణించడంతో భారత్ 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. లంక బౌలర్లలో హసరంగ, తీక్షణ, చమిక కరుణరత్నే రాణించారు. అనంతరం లంక నిర్ణిత ఓవర్లలో 160 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అరంగేట్ర బౌలర్ శివమ్ మావి అదరగొట్టాడు. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ కూడా రాణించారు. కెప్టెన్ శానక, చమిక లంకను గెలిపించడానికి గట్టి ప్రయత్నమే చేశారు. రెండో టి20 గురువారం పూణేలో జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news