భారత వెబ్​సైట్లపై ఇండోనేషియా హ్యాకర్ల ఫోకస్.. కేంద్రం అలర్ట్

-

ఇండోనేషియా హ్యాకర్ల కన్ను భారత వెబ్ సైట్ల పడింది. ఆ దేశానికి చెందిన ఓ సైబర్ ముఠా భారత ప్రభుత్వ వెబ్ సైట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు కేంద్ర హోంశాఖలోని ‘ఇండియన్ సైబర్‌క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌’ ముందుగానే గుర్తించి అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు 12 వేల వెబ్‌సైట్లను ఓ హ్యాకర్ల బృందం లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవి కూడా ఉన్నట్లు పేర్కొంది.

‘డినయల్‌ ఆఫ్‌ సర్వీస్‌’, ‘డిస్ట్రిబ్యూటెడ్‌ డినయల్‌ ఆఫ్‌ సర్వీస్‌’ దాడుల ద్వారా వెబ్‌సైట్లను హ్యాకర్లు తమ అధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. వేర్వేరు వ్యక్తిగత కంప్యూటర్ల ద్వారా ఒకేసారి పెద్ద ఎత్తున సమాచారం వెబ్‌సైట్లలోకి చొప్పించి సైబర్‌ దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. హ్యాకర్లు టార్గెట్‌ చేసుకున్న కొన్ని వెబ్‌సైట్లను కూడా కేంద్రం గుర్తించింది.

ఆ సమాచారాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పంచుకుంది. ఈ నేపథ్యంలో అపరిచిత మెయిల్స్‌, లింకులను ఎట్టిపరిస్థితుల్లోనూ యాక్సెస్‌ చేయొద్దని అధికారులను హోంశాఖ హెచ్చరించింది. అన్ని సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news