అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్‌ దారుణ హత్య

-

పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ జిల్లాలో అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ సందీప్ నంగల్ మృతి చెందారు. నిన్న సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో నలుగురు దుండగులు కబడ్డీ ప్లేయర్ సందీప్ ను కాల్చి చంపేశారు. షాకోట్‌ లోని మల్లియన్‌ కలాన్‌ గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్‌ జరుగుతుండగా… ఈ ఘటన చోటు చేసుకుంది.

మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో నలుగురు వ్యక్తులు కారులో వచ్చిన అతనిని కాల్చి చంపారు. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని.. నిందితులను పట్టుకుంటామని జలంధర్‌ ఎస్‌పీ సతీందర్‌ సింగ్‌ ప్రకటన చేశారు. సందీప్‌ స్వస్థలం షాకోట్‌ లోని నంగల్‌ అంబియాన్‌ గ్రామం.

నంగల్‌ తన కుటుంబంతో.. సహా ఇంగ్లండ్‌ లో స్థిరపడ్డాడు. అయినా.. తరచూ పంజాబ్ లో కబడ్డీ టోర్నమెంట్‌ లను నిర్వహించేవారు. కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. శిరోమణి అకాలీదల్‌ నాయకుడు సుఖ్‌ బీర్‌ సింగ్‌ బాదల్‌ హత్యను ఖండించారు. హంతకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news