కొండచరియలు విరిగిపడి 16 మంది మృతి

-

దక్షిణ ఈక్వెడార్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 16 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న రెస్కూ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. మరికొన్ని ఇళ్లు శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 500 మంది జనాభా, 163 ఇళ్లు ఉంటాయని అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో 16 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆరుగురిని ప్రాణాలతో రక్షించినట్లు వారు వెల్లడించారు. సుమారు 7 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు. కొద్ది రోజులగా కురుస్తున్న వర్షాల కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఇదొక భయంకరమైన ప్రమాదమని ఆ దేశ రవాణా శాఖ మంత్రి డారియో హెర్రెరా అన్నారు. ప్రస్తుతం తామంతా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నామని వెల్లడించారు. ఘటన ప్రాంతంలోని ఇళ్ల నుంచి ప్రజలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని  పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news