భారతీయులకు పాకిస్తాన్ గుడ్ న్యూస్…!

-

పాకిస్తాన్ నుండి ఈ రోజు 133 మంది భారతీయ పౌరులు భారతదేశానికి తిరిగి వస్తారని పాకిస్తాన్ లోని భారత హైకమిషన్ తెలిపింది. తిరిగి వచ్చే వారి కోసం వాఘా బోర్డర్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. “అక్టోబర్ 19 న పాకిస్తాన్లోని భారతదేశం యొక్క హైకమిషన్ 133 మంది భారతీయులను పాకిస్తాన్ నుండి భారతదేశానికి తిరిగి వస్తారు. వారి జాబితాను కూడా విడుదల చేస్తున్నాం అని హై కమీషన్ ప్రకటన చేసింది.

ఇక వారి కోసం పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు సరిహద్దులకు చేరుకున్నారు. ఏ విధమైన అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత ఏర్పాటు చేసారు. వారి అందరికి ఆరోగ్య పరీక్షలతో పాటుగా కరోనా పరీక్షలను కూడా నిర్వహించి భారత్ కు తీసుకొస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news