పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మణం

-

పాకిస్థాన్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. ఎదురుగా వస్తున్న బస్సును ఓ ట్రక్​ ఢీకొట్టింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. ఖైబర్ పఖ్​తుంక్​వా ప్రావిన్స్​లో గురువారం ఈ ప్రమాదం జరిగింది. ట్రక్​ బ్రేకులు ఫెయిల్​ అవ్వడంవల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. మరణించిన వారి మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పెషావర్‌లోని సింధు రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఖైబర్ పఖ్​తుంక్ గవర్నర్ హాజీ గులాం అలీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆజం ఖాన్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు

Read more RELATED
Recommended to you

Latest news