సిడ్నీ ప్రజలకు రాణి ఎలిజబెత్ 2 లేఖ.. 2085 వరకు తెరవడానికి వీల్లేదు

-

బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ 2 మరణంతో ఆ కుటుంబంలో, ఆ దేశంలో విషాదం అలుముకుంది. రాణి మరణం తర్వాత కొన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందులో ఒకటి రాణి రాసిన లేఖ. ఈ లేఖను 2085 వరకు తెరవకూడదనే నియమం కూడా ఉంది. ఇంతకీ రాణి ఎవరికి లేఖ రాశారంటే..?

1986, నవంబర్‌లో ఎలిజబెత్ 2 ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రజలను ఉద్దేశించి లేఖ రాశారు. ప్రస్తుతం దానిని సిడ్నీలోని క్వీన్‌ విక్టోరియా భవనంలో ఓ రహస్య ప్రదేశంలో భద్రపరిచారు. అయితే, అందులో ఏముందో ఆమె వ్యక్తిగత సిబ్బందితో సహా ఎవరికీ తెలీదు. మరో విషయం ఏంటంటే.. 2085 వరకు దానిని తెరిచి, చదివేందుకు వీలు లేదు. ‘2085లో తగిన రోజు చూసుకొని ఈ లేఖను తెరవండి. సిడ్నీ ప్రజలకు నా సందేశాన్ని చేరవేయండి’ అని నాటి నగర మేయర్‌ను ఉద్దేశించి రాణి సూచించినట్లు తెలుస్తోంది. ఆ లేఖపై ఎలిజబెత్ ఆర్‌ అనే సంతకం కూడా ఉంద. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మీడియా కథనాలు ప్రచురించాయి.

మరోవైపు.. ఎలిజబెత్ 2 మృతి పట్ల ఆస్ట్రేలియా సంతాపం తెలియజేసింది. 16 సార్లు తమ దేశంలో పర్యటించినట్లు వెల్లడించింది. ఇక.. దేశాధినేతగా రాణిని కొనసాగించాలా..? వద్దా..? అనే దానిపై 1999లో ఆ దేశం ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహించింది. అయితే అది నెగ్గలేదు. ప్రస్తుతం.. కింగ్‌ ఛార్లెస్‌-3ని తమ దేశాధినేతగా ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news