24గంటల్లో 3లక్షలకు పైగా కేసులు.. 5వేలకు పైగా మరణాలు..!

-

కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచం అంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఈ మహమ్మారి దెబ్బకి ప్రభుత్వాలకి, ప్రజలకి కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. ఇకపోతే తాజాగా.. ప్రపంచ వ్యాప్తంగా గత 24 గంటల్లో 3లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 2కోట్ల 86 లక్షలు దాటింది.

కరోనాతో 5,602 మంది చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 9లక్షల 18వేలకి పెరిగింది. రికవరీ కేసులు 2కోట్ల 5లక్షలు దాటడం మంచి విషయం. యాక్టివ్ కేసులు 71 లక్షలకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల రేటు 4 శాతంగా కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news