ఇండియాలో ఇంటర్నెట్‌ వినియోగం మాములుగా లేదుగా..80 కోట్లను దాటేసిందే..!!

-

డిజిటల్‌ ప్రపంచంలో ఇంటర్నెట్‌ లేకపోతే ఎలా.. ఈరోజుల్లో ఇంటర్నట్‌ అవసరం అయిపోయింది.. నిత్యవసర జాబితాలో ఇంటర్నెట్‌ బిల్‌ కూడా చేరింది. ఒక్కరోజు ఫోన్‌లో నెట్‌ లేకపోతే బయటకు వెళ్తే పేమెంట్స్‌ ఎలా చేయాలి, ఇన్‌స్టా, యూట్యాబ్‌, ఫేస్‌బుక్‌ ఇవన్నీ ఎలా చూస్తాం.. వాట్సప్‌లో ఆఫీస్‌ నుంచి ఏదైనా ఇంపార్టెంట్‌ మెసేజ్‌ వస్తే.. అసలు ఒక రకంగా చెప్పాలంటే.. మన ప్రపంచమే ఆగి పోయినట్లు అవుతుంది కదా..

భారతదేశంలోని ఇంటర్నెట్ వినియోగదారులకు సంబంధించిన గణాంకాలను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ గణాంకాలు ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ (IIGF) రెండో ఎడిషన్‌లో అందించారు. భారత్‌లో ఇంటర్నెట్‌ను వినియోగించే వినియోగదారుల సంఖ్య 80 కోట్లను దాటిందని గణాంకాలలో తేలింది.

80 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులతో భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద ‘కనెక్ట్’ దేశంగా మారిందట. 5జీ, అతిపెద్ద గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ నెట్‌వర్క్ ప్రాజెక్ట్ అయిన BharatNet 120 కోట్ల బిలియన్ భారతీయ వినియోగదారులను కలిగి ఉందని, గ్లోబల్ ఇంటర్నెట్‌లో వీరిది కీలకపాత్ర అని మంత్రి రాజీవ్‌ అభిప్రాయపడ్డారు. సాంకేతిక ఆవిష్కరణలతో పాటు అప్‌డేట్ చేసిన రెగ్యులేటరీ పాలసీలతో కొనసాగాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఇది భారతీయ ఇంటర్నెట్‌ను, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి దోహదపడనుంది.

అనేక అంశాలపై చర్చ..
జీ20కి భారతదేశ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గ్లోబల్ సౌత్‌లోని డిజిటల్ ఎకానమీని మార్చడానికి ఆసక్తి ఉన్న దేశాలకు సహాయం చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చాలా మంది వాటాదారులు భారతదేశ డిజిటలైజేషన్, ఇంటర్నెట్‌కు సంబంధించి గత, వర్తమాన, భవిష్యత్తు రోడ్‌మ్యాప్‌పై చర్చించారు. పౌరసమాజం, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వాలకు చెందిన వ్యక్తులను ఏకతాటిపైకి తీసుకురావాలని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థను సృష్టించే మార్గాలను కనుగొనడంలో ప్రభుత్వం నిమగ్నమై ఉందని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అల్కేష్ కుమార్ శర్మ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news