తెలంగాణ రైతులకు శుభవార్త.. నేటి నుంచి రైతు బంధు దరఖాస్తులకు ఆహ్వానం

-

తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు చెప్పింది. రైతు బంధు పథకం కోసం అర్హు లైన కొత్త రైతులను… దరఖాస్తు చేసుకోవడానికి… అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈనెల 10 వ తేదీ నాటికి ధరనీ పోర్టల్ లో నమో దైన, కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాల పొందిన రైతులు… 2020 -21 యాసంగి సీజన్ రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలని తాజాగా వ్యవసాయ శాఖ సూచనలు చేసింది.

ఇప్పటికే రైతుబంధు పొందుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది వ్యవసాయ శాఖ. రైతుబంధు పథకానికి కొత్తగా అర్హులైన వారు తమ దరఖాస్తులను స్థానిక వ్యవసాయ శాఖ అధికారులకు అందజేయాలని పేర్కొంది. దరఖాస్తు తో పాటు పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్స్ కాపీ లేదా తాసిల్దార్ డిజిటల్ సంతకం చేసిన పత్రం,  ఆధార్ కార్డు జిరాక్స్,  బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ కాఫీ లు అంద జేయాలని స్పష్టం చేసింది వ్యవసాయ శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news