కేటీఆర్ కు అరుదైన గౌరవం : ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం

-

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది. ఫ్రెంచి ప్రభుత్వం మంత్రి కే. తారకరామారావును తన సెనెట్లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం పంపింది. ఈ నెల 29 న ఫ్రెంచ్ సెనేట్లో జరిగే అంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాల్సిగా విజ్ఞప్తి చేసింది. ఫ్రెంచ్ ప్రధానమంత్రి ఇమ్మాన్యూల్ మాక్రోన్ సారథ్యంలో ఏర్పాటయిన ఈ సదస్సు భారత్- ఫ్రెండ్స్ దేశాల మధ్య వ్యాపార , వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతానికి దోహదం చేస్తుందని ఫ్రెంచ్ ప్రభుత్వం మంత్రి కేటీఆర్ కు పంపిన లేఖలో పేర్కొంది.

ktr
ktr

అంబీషన్ ఇండియా 2021 సదస్సులో కీనోట్ స్పీకర్ గా గ్రోత్ – డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కోవిడ్ ఎరా(era) అనే అంశం పైన తన అభిప్రాయాలు పంచుకోవాలని మంత్రి కేటీఆర్ ని కోరారు. గతంలో నిర్వహించిన అంభీషన్ ఇండియా సదస్సులో సుమారు 700 మంది వ్యాపార, వాణిజ్య భాగస్వాములు, 400కు పైగా ఇరు దేశాల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని, ఈ సారి సైతం అంతకుమించి కంపెనీల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని, ఇలాంటి కీలకమైన వేదిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ కు పంపిన లేఖలో ఫ్రెంచ్ ప్రభుత్వం పేర్కొంది.

ముఖ్యంగా ఈ సదస్సులో హెల్త్ కేర్, క్లైమేట్ చేంజ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆగ్రో బిజినెస్ వంటి ప్రధానమైన అంశాలపైన  ప్రత్యేక సమావేశాలను ఈ సదస్సులో భాగంగా ఏర్పాటు చేశామన్నారు. దీంతో పాటు ఫ్రెంచ్ మరియు భారత కంపెనీల మధ్య ద్వై పాక్షిక సమావేశాలు ఉంటాయని మంత్రి కేటీఆర్ కి పంపిన ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news