ఐపీఎల్ 2023: రోహిత్ టాస్ గెలిచాడబ్బా… కానీ మ్యాచ్ సంగతి ఎటుకానుందో !

-

ఐపీఎల్ లో ఈ రోజు పాయింట్ల పరారీలో అట్టడుగున ఉన్న రెండు జట్ల మధ్యన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరో ఒకరు గెలవడం పక్కా కాబట్టి.. ఎవరి ఖాతాలో ఎంతో విలువైన ఆ రెండు పాయింట్లు పడనున్నాయి అన్నది తెలియాలంటే మ్యాచ్ ముగిసే వరకు ఆగాల్సిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. గత రెండు మ్యాచ్ లలోనూ టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసి ఓటమై పాలైన ముంబై ఎట్టకేలకు టాస్ గెలిచింది. అయితే మ్యాచ్ లో ఏ విధంగా రాణించనున్నారు అన్నది తెలియాల్సి ఉంది.

కాగా ఈ మ్యాచ్ లోనూ ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆడడం లేదు. కానీ సౌత్ ఆఫ్రికా ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ కు బదులుగా ఆస్ట్రేలియా పేసర్ రిలీ మెరెడిత్ ను జట్టులోకి తీసుకుంది. మరి ఈ బౌలర్ ముంబై కు మొదటి విజయాన్ని అందిస్తాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news