ఐపీఎల్ 2023:65 బంతుల్లో సెంచరీ చితకొట్టిన ప్రభుసిమ్రన్ సింగ్…

-

పంజాబ్ మరియు ఢిల్లీ మ్యాచ్ లో ఈ రోజు మరో సెంచరీ నమోదు అయింది. మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ వార్నర్ బౌలింగ్ తీసుకున్నాడు, తాను తీసుకున్న నిర్ణయానికి 100 శాతం ఢిల్లీ బౌలర్లు న్యాయం చేశారు. పవర్ ప్లే లోనే మూడు కీలక వికెట్లు పడగొట్టి పంజాబ్ ను దెబ్బ తీశారు. ముఖ్యంగా ఇషాంత్ శర్మ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ధావన్ మరియు లివింగ్ స్టన్ లను అవుట్ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఓపెనర్ గా వచ్చిన ప్రభుసిమ్రన్ సింగ్ మొక్కవోని దీక్షతో క్రీజులో పాతుకుపోయాడు. ఇతను జట్టుకు అవసరం అయిన పరుగులను సాధించి అవుట్ అయ్యారు. ఈ క్రమంలో ప్రభుసిమ్రన్ సింగ్ ఐపీఎల్ కెరీర్ తొలి సెంచరీ నమోదు చేశాడు.

మొత్తం 65 బంతులు ఆడిన సింగ్ 10 ఫోర్లు మరియు ఆరు సిక్సులతో 103 పరుగులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్ లో షాట్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. దీనితో ఇతనిపై ప్రముఖ క్రికెటర్ల నుండి ప్రశంశల జల్లు కురుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news