ఐపీఎల్ 2023 : “చెన్నై – బెంగుళూరు” మ్యాచ్ ను ఎన్ని కోట్ల మంది చూశారో తెలుసా?

-

ఐపీఎల్ మొదలైన రోజు నుండి నిన్న జరిగిన చెన్నై మరియు బెంగుళూరు మ్యాచ్ వరకు ఎన్నో రికార్డులు నమోదు అయ్యాయి. కాగా నిన్న జరిగిన మ్యాచ్ మాత్రం మరో సరికొత్త రికార్డును మూటగట్టుకుంది. ఆఖరి రెండు బంతుల వరకు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరికి చెన్నై నే విజయం వరించింది. చివరి ఓవర్ లో 19 పరుగులు అవసరం అయిన దశలో యంగ్ బౌలర్ పతిరణ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి బెంగుళూరు ను కట్టడి చేశాడు. దీనితో చెన్నై ఎనిమిది పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కాగా ఈ మ్యాచ్ ను మొత్తం జియో సినిమా యాప్ లో మొత్తం 2 కోట్ల 40 లక్షల మంది వీక్షించడం విశేషం. ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఇదే అత్యధిక వ్యూయర్ షిప్ ను అందుకుంది, గతంలో చెన్నై రాజస్థాన్ మ్యాచ్ ను 2 కోట్ల 20 లక్షల మంది చూశారు.

ఇక ఇవి కాకుండా ఆ తర్వాత బెంగుళూరు లక్నో మ్యాచ్ ను 1 .8 కోట్ల మంది , హైదరాబాద్ కోల్కతా మ్యాచ్, ముంబై ఢిల్లీ మ్యాచ్ మరియు చెన్నై లక్నో మ్యాచ్ లను 1 .7 కోట్ల మంది వీక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news