IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీలింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది . ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్ లు ఆడి 4 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ 13 మ్యాచ్ లు ఆడి 6 గెలిచి పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది.ముంబై ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లక్నో సూపర్ జెయింట్స్ కథ కూడా ముగిసినట్లే. ఉదాహరణకు.. తాము 200 స్కోర్ చేసి ముంబైని 100లోపు ఆలౌట్ చేసినా లక్నో రన్ రేట్ -0.351కు మాత్రమే చేరుతుంది. ఆర్సీబీ, సీఎస్కే రెండూ భారీ రన్రెట్తో ఉన్న నేపథ్యంలో లక్నోకు ప్లే ఆఫ్స్ దాదాపు అసాధ్యం.

Read more RELATED
Recommended to you

Latest news