IPL 2024 : ‘ముంబై కా రాజా’ ఎంట్రీ మామూలుగా లేదుగా..!

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వస్తోందంటే క్రికెట్ లవర్స్ కి పండగే. ఏడాదికోసారి జరిగే ఈ మ్యాచ్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈసారి ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టులో చేరారు. ‘ముంబై కా రాజా’ వచ్చాడంటూ ఆ ఫ్రాంచైజీ ఓ స్పెషల్ వీడియోను ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేసింది. బ్లాక్ గ్లాసెస్, టీషర్ట్ ధరించిన హిట్మ్యాన్ రోహిత్ శర్మ స్టన్నింగ్ లుక్తో హోటల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ.. హార్దిక్ పాండ్య నాయకత్వంలో బరిలోకి దిగనున్నారు. ఈ నెల 24న ముంబై తమ తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఆడనుంది. కాగా, ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందే హిట్ మ్యాన్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని ముంబై ఇండియన్స్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ నిర్ణయంపై ముంబై ఇండియన్స్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news