IPL 2022 : RCBలోకి డేవిడ్ వార్నర్, నటరాజన్.. పూర్తి జట్టు ఇదే!

-

ఐపీఎల్ 2022 మెగా వేలం ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐపిఎల్ ఫ్రాంచైజీలు… ఆటగాళ్లను కొనుగోలు చేయడంపై దృష్టి సారించాయి. ముఖ్యంగా బెంగళూరు జట్టు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్ వెల్ అలాగే మహమ్మద్ రాజులను 33 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది బెంగళూరు జట్టు. ఇంకా ఆ జట్టు దగ్గర 57 కోట్లు ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే మెగా వేలంలో డేవిడ్ వార్నర్ లతోపాటు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, ప్యాట్ కమ్మిన్స్ లను తీసుకోవాలని భావిస్తోంది ఆర్ సి బి. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో… డేవిడ్ మలాన్, మిచెల్ మార్స్, నికోలస్ పురన్ లాంటి ఆటగాళ్లను టార్గెట్ చేస్తోంది.

బెంగళూరు జట్టు అంచనా : డేవిడ్ వార్నర్ లేదా శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్, ఈషాన్ కిషన్, మాక్స్ వెల్, మిచెల్ మార్స్ లేదా నికోలస్ పురాన్, సుందర్, హసరంగా, అహ్మద్, రాహుల్ చాహర్, మహమ్మద్ సిరాజ్, నవదీప్ షైనీ, ప్రషీద్ కృష్ణ, జగదీష్ సుజిత్, అశ్విన్ హెబ్బర్, అగర్వాల్ అలాగే తిలక్ శర్మ.

Read more RELATED
Recommended to you

Latest news