ఢిల్లీ క్యాపిటల్ డీసెంట్ స్కోర్… సీఎస్కే టార్గెట్ 173

-

తుది ఘట్టానికి చేరుకున్న ఐపీఎల్ లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ డిసెంట్ స్కోర్ సాధించింది. ప్రుథ్వీ షా మెరుపులు, పంత్ అర్థ శతకంతో ఢిల్లీ 172 స్కోర్ సాధించింది. మొదటగా ప్రుథ్వీ షా విధ్వంసం స్రుష్టించాడు. కేవలం 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 60 పరుగులు చేశారు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తక్కువ స్కోర్ 7 కే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటెల్ నిరాశ పరిచారు. చివరిలో హెట్మేయర్ 37 పరుగులు, పంత్ 51 పరుగులతో ఢిల్లీకి గౌరవప్రద స్కోరు అందించారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో జోస్ హెజిల్ వుడ్ 2 వికేట్లు తీయగా, రవీంద్రజడేజా, డ్వేన్ బ్రావో, మెయిన్ అలీ తలోవికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news