తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా..? రూ.4,000 లోపే IRCTC తిరుపతి టూర్..!

-

మీ శ్రీవారిని దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారా..? తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అయితే కచ్చితంగా ఈ ప్యాకేజీని చూడాల్సిందే. రాజమండ్రి నుంచి తిరుపతికి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే..

గోవిందం పేరు తో విజయవాడ, రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్లేందుకు టూర్ ప్యాకేజీ అందిస్తోంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతీ శుక్రవారం ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది. శేషాద్రి ఎక్స్‌ప్రెస్ సామర్లకోట జంక్షన్‌లో 5.40 గంటలకు స్టార్ట్ అవ్వగా రాజమండ్రిలో 6.20 గంటలకు, విజయవాడలో రాత్రి 10.50 గంటలకు రైలు చేరుకుంటుంది. భక్తులు ఉదయం 8.30 గంటలకు తిరుమల రీచ్ అవుతారు. శ్రీవారి దర్శనం చేసుకున్నాక తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి ని చూడచ్చు.

తరవాత మళ్ళీ తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. రాత్రి 8.30 గంటలకు తిరుమల ఎక్స్‌ప్రెస్ ఎక్కితే నెస్ట్ డే ఉదయం రీచ్ అయ్యిపోవచ్చు. వీకెండ్ లో ఇలా మీరు తిరుమల చూసి వచ్చేయచ్చు. ఇక ధరల విషయానికి వస్తే స్టాండర్డ్ ప్యాకేజీకి ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.3690, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.3780 గా వుంది. సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.4520 వుంది. ఈ ప్యాకేజీ కి సంబంధించి మరిన్ని వివరాలని IRCTC వెబ్ సైట్ లో చూడచ్చు. IRCTC వెబ్ సైట్ లోనే బుక్ చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news