తెలుగులో ఈసారి నెంబర్ వన్ హీరో అతనేనా..?

-

ఎప్పటిలాగే ఈసారి కూడా తెలుగు మోస్ట్ పాపులర్ మేల్ స్టార్ గా ప్రభాస్ గుర్తింపు తెచ్చుకున్నారు. అక్టోబర్ నెలకి సంబంధించి ఓర్మాక్స్ మీడియా నిర్వహించిన సర్వేలో మళ్ళీ ప్రభాస్ కి ఎక్కువ మంది పట్టం కట్టడం జరిగింది. ఒక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ఆ తర్వాత అన్ని కథలు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఎంచుకుంటూ ఉండడం గమనార్హం. అయితే ఈసారి ఈయన నటించిన రాధే శ్యామ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచినప్పటికీ ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గలేదని తాజా సర్వే ద్వారా తేలిపోయింది.. తాజాగా మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితాను విడుదల చేయగా అందులో ప్రభాస్ మొదటి స్థానానికి చేరుకున్నారు.

ఇక ఆ తర్వాత స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు , రామ్ చరణ్ టాప్ 5 లో స్నానం సంపాదించుకున్నారు. ఇక ఆరవ స్థానంలో పవన్ కళ్యాణ్, ఏడవ స్థానంలో నాని , ఎనిమిదవ స్థానంలో విజయ్ దేవరకొండ, 9వ స్థానంలో చిరంజీవి, పదవ స్థానంలో వెంకటేష్.. ఇలా వీళ్ళందరూ టాప్ టెన్ లో నిలిచారు. కానీ నందమూరి బాలకృష్ణ , అక్కినేని నాగార్జున చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ అయితే కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ ఇప్పుడే మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ సినిమాలో ఒక సినిమా చేస్తున్నారు. మొత్తానికైతే ఈ స్టార్ హీరోలు వరుసగా అభిమానులను పోగు చేసుకోవడమే కాకుండా వరుసగా సినిమాలతో బిజీ అయిపోతున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ ఈనెల కూడా మొదటి స్థానం చేరుకోవడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news