ఆ దోషం వల్లే సమంత రంగురాళ్ళు ధరించిందా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి పరిచయం అవసరం లేదు. ఇకపోతే సాధారణంగా సెంటిమెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది . అయితే ఏ విషయంలోనైనా సరే ఆ సెంటిమెంటుని వారు ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా సామాన్యులే కాదు చదువుకున్న వారు అలాగే ఉన్నత స్థానానికి చేరుకున్న వారు కూడా ఇలా సెంటిమెంట్లను నమ్ముతూ ఉంటారు. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు మాత్రం చాలా బాగా తమ సెంటిమెంట్లను ఫాలో అవుతారనటంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ సెంటిమెంట్లు నమ్ముకున్నారు.

ఈ క్రమంలోనే సమంత కూడా వీటిని నమ్ముతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే సమంతా ప్రస్తుతం వ్యక్తిగతంగా , మానసికంగా బాధపడుతున్న విషయం తెలిసిందే. గత కొద్దిరోజుల నుంచి ఈమె అరుదైన మయో సిటీస్ అనే వ్యాధితో బాధపడుతోంది. దీంతో మొన్నటివరకు అమెరికాలో ట్రీట్మెంట్ చేయించుకుంది . ప్రస్తుతం యశోద సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో హైదరాబాదులో ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత ఇంటర్వ్యూ కి సంబంధించి ఫోటోలు , వీడియో బయటికి రాగా అందులో ఆమె తన చేతి వేళ్ళకు రంగురాళ్లు ధరించినట్లు మనం చూడవచ్చు.

అయితే గతంలో సమంత చేతికి అన్ని ఉంగరాలు లేవు. కానీ ఇప్పుడు అన్ని ఉంగరాలు పెట్టుకోవడంతో తాను కూడా ఏదైనా సెంటిమెంటును ఫాలో అవుతోందా అని అనుమానాలు రేకత్తాయి. అయితే సమంత ధరించిన రింగులు డిజైనర్ రింగులు కావని , హిందూ సంస్కృతి ప్రకారం అవి కొన్ని జాతకాల ప్రకారం , అదృష్టం ప్రకారం ధరించినట్లు తెలిసింది. అయితే ఈమె ధరించిన ఉంగరంలో ఒకటి కనకపుష్యరాగం ఉంగరం ఉంది.. ఇది సంపద, ఆరోగ్యం, కీర్తి, ఫలవంతమైన సంపదలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈమె ధరించిన గోమేధకం రాయి ఉంగరం కూడా చెడు దృష్టి నుంచి కాపాడుతుంది. రాహు గ్రహం చెడు ప్రభావం తగ్గించడానికి, ఈ వుంగరం ధరించిన వారికి శారీరకంగా, మానసికంగా బాగుంటుంది. అంతేకాదు ఈమె ధరించిన మరో ఉంగరం ముత్యం . ఇది చంద్రుడు ఒక్కో క్షణంలో బలహీనంగా మారుతాడు. ఆ ప్రభావం మన ఆరోగ్యం పై పడకుండా ఇలాంటి ఉంగరాలు ధరిస్తారు. మొత్తానికైతే ఈ సెంటిమెంట్లను ఈమె బాగానే ఫాలో అవుతుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news