ఇది సీఎం మాట్లాడే భాషేనా..కేసిఆర్ ఫైర్

-

నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….మళ్లీ మన ప్రభుత్వమే వస్తది.. ఇందులో ఏం అనుమానం లేదు.. రంది పడాల్సిన అసవరం లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.

ఆనాడు మీ అండదండలతో పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. నా చావుకు కూడా తెగించి దీక్ష పట్టి తెలంగాణ సాధించాం అని అన్నారు. కానీ ఇవాళ ఈ రాష్ట్రం సీఎం సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. కేసీఆర్.. నీ గుడ్లు పీకి గోటీలు అడుకుంటా. నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇది సీఎం మాట్లాడే భాషేనా..? ఇది ధర్మమేనా..? అని ప్రశ్నించారు. తెలంగాణ సాధించిన వ్యక్తిని, ఇన్నేండ్లు పోరాటం చేసిన వ్యక్తిని, వచ్చిన తెలంగాణను తెల్లగా చేసిన వ్యక్తిని, కరెంట్ కోసం తండ్లాడిన వ్యక్తిని,మంచినీళ్లు, సాగు నీళ్లు.. నన్ను ప్టటుకుని ఇన్ని మాటలు అనొచ్చానా..? ఇది ధర్మమేనా..? ఇదా మన తెలంగాణ గౌరవమా..? అని ఆయన నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news