లోక్ సభ ఎన్నికల్లో డబుల్‌ డిజిట్‌ సీట్లు గెలవబోతున్నాం : కిషన్ రెడ్డి

-

ఆరు గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదన్నారు కిషన్ రెడ్డి.

 

బీసీ ప్రధాన మంత్రిగా ఉన్నారన్నారు. మేము అనని మాటలను మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు .కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని, తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్‌కు కాంగ్రెస్‌ ఎసరు పెట్టిందని ఆయన ధ్వజమెత్తారు. మా మేనిఫెస్టోలోని అంశాలను కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది ఇన్నేళ్లు అధికారంలో ఉండి బీసీని ప్రధానిని చేశారా? అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

ఓడిపోతే తన కుర్చీకి ఎసరు వస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అబద్దాలు చెబుతున్నారు. రేవంత్‌ తన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు అని విమర్శించారు. బీజేపీని చూసి కాంగ్రెస్‌ కాళ్ల కింద కుర్చీ కదులుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోవడం ఖాయం. తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ సీట్లు గెలవబోతున్నాం అని తెలిపారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రేవంత్‌ రెడ్డి పీఠం కదలడం ఖాయం” అంటూ కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news