హైదరాబాద్ పార్లమెంట్ లో బిజెపి జెండా ఎగరవేయడం ఖాయం : ఎంపీ డా.లక్ష్మణ్

-

రాముడే లేడని మాట్లాడిన కాంగ్రెస్ కావాలో.. రామునికి గుడి కట్టిన మోది కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు రాజ్యసభ ఎంపీ డా.కే.లక్ష్మణ్. తాజాగా ఆయన చార్మినార్ అసెంబ్లీ నుండి యకత్ పురా అసెంబ్లీ గౌలిపుర చౌరస్తా కు చేరుకున్న విజయ సంకల్ప యాత్ర కు ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ఎమ్మెల్సీ నసీర్ షా గెలిచిన సందర్భంగా పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. మన దేశంలో ఉంటూ, మన దేశ తిండి తింటూ, మన ప్రజలతో ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్ కి జిందాబాద్ అనడం సిగ్గు చేటు అన్నారు.

వెంటనే కాంగ్రెస్ అధిష్టానం వాళ్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. దేశం సస్యసామలంగా ఉండాలంటే మోడీ ప్రభుత్వంతోనే సాధ్యం అన్నారు. తాను ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్య సభ సభ్యుడుగా ఉన్నాను..అక్కడ బిజెపి సిఎం యోగి అధిత్యనాథ్ గ్యాంగ్ స్టార్స్ మాఫియాను బుల్డోజర్లతో కూల్చేశారు. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ చాలా ప్రశాంతంగా ఉంది..అలాగే హైదరాబాద్ లో బిజెపి నీ గెలిపిస్తే హైదరాబాద్ కూడా సస్యసామలంగా మారుతుంది..కాంగ్రెస్ , బిఆర్ఎస్ పార్టీ లు ఓవైసీ తొత్తులుగా మారి పాత బస్తి నీ డెవలప్ జరగకుండా చేస్తున్నారు.

బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం కోసం పని చేస్తుంది. కాంగ్రెస్ నెహ్రూ కుటుంబం కోసం పని చేస్తుంది.కానీ బీజేపీ  మోడీ సర్కార్ మాత్రం ప్రజల కోసం దేశం కోసం పని చేస్తుంది. పాత బస్తీ బాగుపడాలంటే బిజెపి నీ గెలిపించాల్సిందే.. ఎక్కడ చూసినా ఫిర్ ఏక్ బార్ మోది సర్కార్ అనే నినాదం వినిపిస్తుంది. ఈ సారి హైదరాబాద్ పార్లమెంట్ లో బిజెపి జెండా ఎగరవేయడం ఖాయం అన్నారు ఎంపీ లక్ష్మణ్.

Read more RELATED
Recommended to you

Latest news