పాలమూరును సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనే : కేసీఆర్

-

పాలమూరు జిల్లా దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి కాదు..చెక్ డ్యామ్ ల రెడ్డి. పట్టుబట్టి 30 చెక్ డ్యామ్ లను మంజూరు చేయించి సుమారు లక్ష ఎకరాల్లో వరి పంట పండించేటట్టు చేసారు. ఓటు రాబోయే ఐదేళ్లలో మీ భవిష్యత్ ను మార్చుతుంది. ఎవ్వరి ద్వారా మంచి జరిగితే వాళ్లను గెలిపించండి. గంజి కేంద్రాలు ఏర్పాటు చేసే గతి పట్టించినది ఏ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. పాలమూరును సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అనే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నేను చెప్పిన మాటలు నిజం కాకపోతే మమ్ముల్ని ఓడించండి.

సమైక్య రాష్ట్రంలో పాలమూరును ఎవ్వరూ పట్టించుకోలేదు. బీఆర్ఎస్ కి అధికారం ఇస్తే ఎలా చేస్తారో మీకు తెలుసు. ఎవ్వరూ అధికారంలో ఉంటే మేలు జరుగుతుందో ఆలోచించి ఓటు వేయండి. ప్రజల చేతిలో ఉండే ఓటు వజ్రాయుధం అన్నారు. అన్ని పార్టీల చరిత్ర చూసి ఓటు వేయాలని కోరారు. 14 ఏళ్ల పోరాటం తరువాత తెలంగాణ వచ్చింది. దేవరకద్ర ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేశ్వర్ రెడ్డి అడిగిన వాటన్నింటిని గెలిచిన తరువాత అమలు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news