ఏపీకి మూడు రాజధానులు చాలా అవసరం – జబర్దస్త్ కమెడియన్ అప్పారావు

-

ఏపీకి మూడు రాజధానులు చాలా అవసరమన్నారు జబర్దస్త్ కమెడియన్ అప్పారావు. ప్రస్తుతం ఏపీలో ఉత్తరాంధ్ర కోసం పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ నిర్ణయానికి అనుకూలంగా ప్రకటన చేశారు జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ అప్పారావు. గతంలో ఏపీ సీఎం జగన్‌ పై ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఇప్పుడు మాత్రం తన పంథా మార్చుకున్నారు జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ అప్పారావు.


వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులకు మద్దతు తెలిపారు. ఈనెల 15న విశాఖ గర్జనకు సపోర్ట్ చేస్తున్నాను అన్నారు. విశాఖపట్నం కళాకారుడిగా ‘మన విశాఖ మన రాజధాని పేరిట విశాఖ గర్జన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ గర్జనను విజయవంతంగా జరగాలని, ‘మన విశాఖను రాజధానిగా మార్చే ప్రక్రియలో అందరం మద్దతు ఇవ్వాలని’ పిలుపునిచ్చారు. విశాఖను రాజధాని చేయాలని కోరుతున్నానని, ఈ మహా యజ్ఞంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news