నేను బాధ పడ్డా కాని నా గుండెల్లో జబర్దస్త్ కు స్థానం ఉంది..!!

-

తెలుగు ప్రజలకు టెలివిజన్ లో ఎంతో దగ్గర అయిన షోలు జబర్దస్త్ మరియు  ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పటి వరకు వీటి రేటింగ్స్ ను కొట్టే షో లు రాలేదంటే వీటిని స్టామినా అర్దం చేసుకోవచ్చు. అంతలా ఈ షోస్ తెలుగు ప్రజలను అలరిస్తూ వస్తున్నాయి. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇటు టీవీ కి మరియు సినిమాకు పరిచయమయ్యారు.జబర్దస్త్ కు మొదట అనసూయ యాంకర్ గా చేసి అదరగొట్టిన సంగతి తెలిసిందే.

వాస్తవానికి తనకి లైఫ్ ఇచ్చిన షోగా జబర్థస్త్ ను చెప్పుకోవచ్చు. ఆ షో వల్లే తనకి మిగిలిన షోస్ మరియు సినిమా అవకాశాలు వచ్చాయి. మరి ఏమి జరిగిందో ఏమో తెలియదు కాని అనసూయ షో వదిలి పెట్టింది. ఈ సందర్భంగా పలు విమర్శలు చేసింది. బాడీ షేమింగ్‌, వల్గర్‌ కామెంట్లు, వల్ల చాలా భాద పడ్డాను అని చెప్పింది. ప్రస్తతానికైతే పుష్ప 2, మరికొన్ని సినిమాలలో నటిస్తూ ఉంది. తాజాగా అనసూయ సోషల్‌ మీడియాలో అభిమానులతో మాట్లడుతూ కొన్ని విషయాలు పంచుకుంది.

ఈ సందర్భంగా ఈ సమయంలో `జబర్దస్త్`ని మిస్‌ అవుతున్న ఫీలింగ్ ఉందా అని ఒక నెటిజన్ ప్రశ్న అడగ్గా, దానికి అనసూయ సమాధానం చెబుతూ  ఆ షోకి తన హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ షో ను ఖచ్ఛితంగా మిస్ అవుతుంటా అంది. అలాగే కొన్నిసార్లు మనకు ఉండాలని ఉన్నా కూడా  కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది` అని పేర్కొంది. వాస్తవానికి జబర్థస్త్ కామెడీ షో చేయాలని ఉన్నా కూడా చేయలేని స్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news