పచ్చమీడియా, దత్తపుత్రుడికి చంద్రబాబు హత్యలు కనిపించవా? – సీఎం జగన్

-

పచ్చమీడియా, దత్తపుత్రుడికి చంద్రబాబు హత్యలు కనిపించవా? అని సీఎం జగన్ నిలదీశారు. ఎన్టీఆర్ ను చంపేసి కుర్చీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని సీఎం జగన్ విమర్శించారు. ‘ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, ఎన్నికల్లో మాత్రం ఎన్టీఆర్ ఫోటోకు దండలు వేస్తాడు. ఫోటోషూట్, డ్రామాలే చంద్రబాబు నైజాం. గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంద్రబాబు చంపేశాడు.

జనం తక్కువ వచ్చారని కందుకూరులో ఇరుకు సందుల్లో సభ పెట్టి, ఎనిమిది మందిని చంపేశాడు. గుంటూరులో ముగ్గురిని చంపేది ఈయనే. మొసలి కన్నీరు కార్చేది ఆయనే’ అని ఫైర్ అయ్యారు.’మనుషులను చంద్రబాబు చంపేసిన ఈనాడు, ABN, TV 5 దత్తపుత్రుడు అడగరు, మాట్లాడరు, ప్రశ్నించరు. చంద్రబాబు తప్పు చేసి పోలీసులదే తప్పు అంటాడు. కందుకూరిలో 8 మంది చనిపోయిన, దాహం తీరనట్లు గుంటూరులో మరో ముగ్గురిని బలి తీసుకున్నాడు’ అని సీఎం జగన్‌ విమర్శల వర్షం కురిపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news