జగన్….శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మమైపోతారు : పవన్ కళ్యాణ్

-

ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి .నామినేషన్ల పర్వం కేసుల ముగియటంతో పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. రాజకీయనేతల మాటల యుద్ధంతో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శ్రీశైల మల్లికార్జున స్వామికి మహాకుంబాభిషేకాన్ని కావాలనే వాయిదా వేశారని, శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మమైపోతారని మండిపడ్డారు.

మహాకుంబాభిషేకాన్ని వాయిదా వేయటానికి ఎండలను సాకుగా చూపుతున్నారని, అసలు కారణం వేరే ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. మహాకుంబాభిషేకం చేస్తే జగన్ పదవి గండం ఉందని జ్యోతిష్యులు చెప్పారని అందుకే వాయిదా వేస్తున్నారని విమర్శించారు.శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మమై పోతారని, మీరెంత మీ స్థాయి ఎంత అని పవన్ మండిపడ్డారు. తరాలుగా వస్తున్న ఆచారాలను తుంగలో తొక్కారని, స్వార్థ ప్రయోగాజనాల కోసం వైసీపీ చాలా చేసిందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news