ఏపీ జర్నలిస్టులకు బిగ్‌ షాక్‌..ఆ టాక్స్‌లు కట్టాలని నోటీసులు !

-

ఏపీలోని జర్నలిస్టులకు జగన్‌ సర్కార్‌ షాక్‌ ఇచ్చింది. ఏపీలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న రిపోర్టర్లకు వృత్తి పన్ను కట్టాలంటూ అధికారుల నుంచి నోటీసులు అందడం ఇప్పుడు వివాదంగా మారింది. పాత బకాయిలు సహ రూ. 12,500 వృత్తి పన్ను చెల్లించాలని ఆ నోటీసుల్లో ఉంది.

వృత్తి పన్ను చెల్లించాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో వివిధ పత్రికలు టీవీ ఛానల్లలో పనిచేస్తున్న 28 మంది విలేకరులకు జనవరి 17న నోటీసులు అందాయి. అమలాపురంలోని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ సర్కిల్ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయి. 2018-19 నుంచి 2022-23 వరకు సంవత్సరానికి రూ. 2500 చొప్పున మొత్తం రూ. 12,500 చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. 15 రోజుల్లోగా చెల్లించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news