కేసీఆర్‌ చేసిన కూల్చివేత వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ సర్కార్‌

-

ఏపీ ప్రభుత్వం కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్. ఏపీ ప్రభుత్వమే కాకుండా బిజెపి లిస్ట్ లో తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీ ప్రభుత్వాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఫామ్ హౌస్ ఫైల్స్ ఫై మొన్న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. అయితే.. కేసీఆర్‌ చేసిన కూల్చివేత వ్యాఖ్యలపై స్పందించింది ఏపీ సర్కార్‌. బీజేపీ నాలుగు రాష్ట్రాలను కూల్చే ప్రయత్నం చేస్తుందని కేసీఆర్ కు ఏమైనా సమాచారం ఉందేమోనని.. మాకైతే ఎటువంటి సమాచారం లేదని తేల్చి చెప్పారు మంత్రి జోగి రమేష్. మాకు అలాంటి సమాచారం వస్తే..స్పందిస్తామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చాలా బలంగా ఉందన్నారు జోగి రమేష్.

Read more RELATED
Recommended to you

Latest news