శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. రేపే అమ్మ ఒడి మూడో విడత నిధులు

-

జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మ ఒడి స్కీం కూడా ఒకటి. నవరత్నాలలో భాగమే ఈ పథకం. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు నిధుల పంపిణీ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం అంటోంది. ఇందులో భాగంగానే అమ్మఒడి మూడో విడత నిధులను బుధవారం జమ చేయాలని భావిస్తోంది.

అంటే 2021 సంవత్సరం లో అక్టోబరు – డిసెంబరు నెలకు సంబంధించి జగనన్న విద్యా దీవెన పథకం కింద ఈ ఆర్థిక సహాయం చేయనుంది. ఈసారి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. దీంతో ఒకేసారి రూ. 709 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే విద్యార్థులు కాలేజీలకు చర్చించాల్సిన పూర్తి ఫీజు మొత్తాన్ని విద్యార్థుల తల్లులకు అందజేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news