రచ్చబండ పేరుతో రేవంత్ రెడ్డి లుచ్చా రాజకీయాలు: మల్లారెడ్డి

-

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రచ్చబండ పేరుతో రేవంత్ రెడ్డి లుచ్చా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు టీఆర్ఎస్ఎల్పీలో మంత్రి మల్లారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను మోసం చేసిన పార్టీ.. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డిది రచ్చబండ కాదని, లుచ్చా బండ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ పూర్తిగా మటాష్ అని ఎద్దెవా చేశారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలోనూ ఎక్కువ కాలం పని చేయలేదని, తను బీజేపీలో చేరినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.

మంత్రి మల్లారెడ్డి
మంత్రి మల్లారెడ్డి

టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి తనను బ్లాక్ మెయిల్ చేశాడని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ఎంపీగా గెలిచిన తర్వాత కూడా బ్లాక్ మెయిల్ చేయడం ఆపలేదన్నారు. ఇప్పటికి పైసలు ఇస్తావా.. లేదా కాలేజీలు మూసివేస్తావా..? అని బెదిరిస్తాడని పేర్కొన్నారు. అందరినీ బ్లాక్ మెయిల్ చేసే రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీని కూడా బ్లాక్ మెయిల్ చేస్తాడని ఆరోపించారు. తాను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, మరి రేవంత్ రెడ్డి ఏ పని చేసి ఇన్ని ఆస్తులు సంపాదించాడని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news