కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్… రేవంత్ రెడ్డికి ఓట్లడిగే హక్కు లేదు

-

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో బీజేపీని ఒడగొట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఏకమయ్యాయని విమర్శించారు. దేశం మొత్తం ప్రధాని నరేంద్రమోడీ వైపు చూస్తోందని అన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు సాధించిన బీజేపీ అధికారంలోకి రాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రుణమాఫీ అన్నారని, ఎన్నికల టైం చూసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.

ప్రజలకు కావాల్సిది దేవుళ్లపై ఒట్లు కాదు.. బ్యాంకుల్లో పడున్న రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన కేవలం 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అన్నారు. సాధ్యం కాని హామీలతో అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు ఓట్లడిగే హక్కు లేదని కిషన్‌రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news