జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్… ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదుల హతం

-

జమ్మూ కాశ్మీర్ లో మరోసారి తుపాకులు గర్జించాయి. భద్రతా దళాలకు విజయం లభించింది. ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో పెరుగుతున్న తీవ్రవాదాన్ని ఎప్పటికప్పుడు భద్రతా బలగాలు తుదముట్టిస్తున్నాయి. తాజాగా మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. బుద్గామ్‌లోని జోల్వా క్రాల్‌పోరా చదూరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరణించిన ముగ్గురు కూడా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. ఇందులో ఒకరిని శ్రీనగర్ సిటీకి చెందిన వసీమ్‌గా గుర్తించారు. మిగతా ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. ఘటన స్థలం నుంచి మూడు ఏకే 56 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే గత నాలుగు రోజుల కాలంలో ఇది మూడో ఎన్ కౌంటర్. ఒక రోజు క్రితం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువైన క్రమంలో భద్రతా దళాలు అప్రమత్తంగా అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news