BRSతో కాంగ్రెస్ పొత్తు తప్పదు… అనుకుంటే – జానారెడ్డి

-

2023 అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ పార్టీతో పొత్తుపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ పార్టీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని తెలిపారు జానారెడ్డి. బీజేపీపై పోరుకు ఎన్నికలకు సంబంధం లేదని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు తప్పదు అనుకుంటే ప్రజలు నిర్ణయిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు జానారెడ్డి.

కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎప్పుడూ పనిచేస్తుందని వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో… తెలియదని…కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ కెసిఆర్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే… అప్పుడు ఆలోచిస్తామని వివరించారు జానారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news