పాతిక మందికి పైగా ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు!

-

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఏపీలోని కొంత మంది నేతలు జనసేన అధినేత పనవ్ అధ్యక్షతన పార్టీలో చేరారు. మరో పాతిక మందికి పైగా తెదేపా ఎమ్మెల్యేలు జనసేనలో కి చేరడానికి సిద్ధంగా ఉన్నారని పార్టీ రాష్ట్ర కన్వీనర్ పార్థసారథి తెలిపారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పార్టీలో యువ తరానికి 60 శాతం సీట్లు ఇస్తామని,  రాష్ట్రం మొత్తం ఓ మేనిఫెస్టో తో పాటు…ప్రతీ నియోజక వర్గానికి ఒక్కో మేనిఫెస్టోని రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అధికార తెదేపా, ప్రతిపక్ష వైసీపీల్లోని నేతలు పవన్ తో చర్చలు కొనసాగిస్తున్నారని త్వరలోనే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news