నేడు జనసేన ‘యువశక్తి’ సభ..పవన్ కళ్యాణ్ అరెస్ట్ తప్పదా ?

-

జనసేన పార్టీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళ్లవలస వద్ద జనసేన ఆధ్వర్యంలో ‘యువశక్తి’ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.

ఈ సభ కోసం 30 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సభ జరగనుంది. మధ్యాహ్నం సభ వేదిక వద్దకు చేరుకోనున్న పవన్, యువతతో మాట్లాడాక ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సభకు సుమారు 1.50 లక్షల మంది వస్తారని అంచనా. మరి సెక్షన్‌ 1 అమలు లో ఉన్న నేపథ్యంలో, పవన్‌ కళ్యాణ్‌ ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news