హీరోలకే షాక్ ఇస్తున్న జాన్వీ, దీపికా పారితోషకం..!

-

ప్రస్తుత కాలంలో పాన్ ఇండియా మార్కెట్ వచ్చింది కాబట్టి తెలుగు సినిమాలలో కూడా నటించడానికి బాలీవుడ్ భామలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.. కానీ ఒకప్పుడు సౌత్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా వాళ్లకు చాలా చిన్న చూపు ఉండేది.. అప్పట్లో తెలుగు సినిమా ఆఫర్లు వస్తే చాలా బెట్టు చేసేవారు బీట్ డౌన్ భామలు. కానీ ఇప్పుడు సౌత్ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ దక్కించుకుంటున్న నేపథ్యంలో బాలీవుడ్ మొత్తం టాలీవుడ్ వైపు చూస్తోందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ,షారుక్ ఖాన్ లాంటి వాళ్లు కూడా తెలుగు హీరోలతో జత కట్టడానికి సిద్ధమవుతున్నారు..

సౌత్ సినిమాలు వరుసగా నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుండడంతో బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు సైతం తెలుగులో నటించడానికి సై అంటున్నారు. ఈ క్రమంలోని ఇప్పుడు దీపికా పదుకొనే ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టు కే లో నటిస్తుండగా.. తాజాగా జాన్వీ కపూర్ కూడా ఎన్టీఆర్ 30వ సినిమాలో నటిస్తోంది.

అయితే ఇప్పుడు పారితోషకం విషయంలో వారు చేస్తున్న డిమాండ్ చూస్తే మాత్రం హీరోలు కూడా కంగు తింటున్నారు.. అసలు విషయంలోకి వెళితే ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి జాన్వి కపూర్ సుమారుగా రూ.5 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం.. అలాగే దీపికా పదుకొనే కూడా ప్రాజెక్టు కే కోసం ఏకంగా రూ.13 కోట్లు డిమాండ్ చేసిందని తెలుస్తోంది. రామ్ చరణ్ సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్నందుకుగాను ఆమె రూ.4 కోట్ల మేరా పారితోషకం డిమాండ్ చేసిందట. అయితే ప్రస్తుతం వీరందరికీ పాన్ ఇండియా స్థాయిలో డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ నిర్మాతలు కూడా అంత పారితోషకం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఏది ఏమైనా హీరోల రేంజ్ లో పారితోషకం తీసుకుండడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news