జగన్‌ మరో సంచలన నిర్ణయం..జవహర్ రెడ్డికి కీలక శాఖల అప్పగింత

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కార్యాలయం లో పనిచేసే ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వo శాఖలను కేటాయించింది. ఇటీవల ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీళ్లు సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా బాధ్యతలు చేపట్టిన టిటిడి మాజీ ఈవో జవహర్ రెడ్డి.. సీఎం for లో పనిచేసే అధికారులకు వివిధ శాఖలలో కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే జవహర్ రెడ్డికి ప్రాధాన్యత క్రమంలో శాఖలను కేటాయించారు. స్పెషల్ సి ఎస్ కె ఎస్ జవహర్ రెడ్డికి… జి.ఎ.డి, హోం శాఖ, అటవీ పర్యావరణ, వైద్య ఆరోగ్య శాఖ, శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ అంశాలు, సీఎం ఎస్టాబ్లిష్మెంట్, రాష్ట్ర విభజన సమస్యలు లాంటివి కీలక శాఖలను కేటాయించింది జగన్మోహన్ రెడ్డి సర్కారు. జవహర్ రెడ్డి కి ఈ కీలక శాఖలు ఇవ్వడంపై ప్రభుత్వం, అటు రాష్ట్రంలో కొత్త చర్చ మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news