దెబ్బ మీద దెబ్బ : జేసీ ప్రభాకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్..!

-

టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. నేతలు ఒకరి తర్వాత ఒకరు అరెస్టు కావడం. అలాగే ఒకరి తర్వాత ఒకరికి రిమాండ్ విధించడంతో టీడీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్ లకు రిమాండ్ విధించగా. తాజాగా ఇవాళ ఉదయం అరెస్టు కాబడ్డ టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కూడా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి విక్రయించారనే కేసులో రిమాండ్ కు పంపించింది. ఆయనతో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి కూడా రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి వీరిద్దరినీ పోలీసులు హైదరాబాదులో అరెస్ట్ చేసి, అనంతపురానికి తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో హాజరుపరిచారు.

Read more RELATED
Recommended to you

Latest news