జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌

-

మహాారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల రోజులు కూడా గడవకముందే.. మరో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేశారు. మొత్తం 81 అసెంబ్లీ స్ధానాలకు ఐదు దశల్లో పోలింగ్‌ జరుగుతుంది. నవంబర్‌ 6న నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. నవంబర్‌ 30న తొలి దశ పోలింగ్‌, డిసెంబర్‌ 7న రెండో దశ, డిసెంబర్‌ 12న మూడో దశ, డిసెంబర్‌ 16న నాలుగో దశ, డిసెంబర్‌ 20న అయిదో దశ పోలింగ్‌ జరుగుతుందని ఈసీ వెల్లడించింది.

ఇక వచ్చేఏడాది జనవరి 5తో ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది.డిసెంబర్‌ 23న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. సీఈసీ సునీల్‌ అరోరా, ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. కాగా, 2000లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత జార్ఖండ్‌లో ఇవి నాలుగో అసెంబ్లీ ఎన్నికలు కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news