UPSC Recruitment 2021: జర్నలిజం అనుభవం ఉన్న వాళ్ళకి గుడ్ న్యూస్.. ఇలా అప్లై చెయ్యండి..!

-

UPSC Recruitment 2021: మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. జర్నలిజంలో అనుభవం ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలని ఇస్తున్నారు. కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖలో పలు ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అర్హత, ఆసక్తి వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

UPSC Recruitment 2021
UPSC Recruitment 2021

దీనిలో మొత్తం 34 ఖాళీలు ఉన్నాయి. సీనియర్ గ్రేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు పలు భాషల్లో జర్నలిజంలో అనుభవం ఉన్నవారికి అవకాశం వుంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 12 చివరి తేదీ. ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. తెలుగు- 5, హిందీ- 9, ఇంగ్లీష్- 3, పంజాబీ- 3, ఒడియా- 3, బెంగాలీ- 1, మరాఠీ- 5, గుజరాతీ- 1, అస్సామీ- 2, మణిపూరి- 2.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, డిగ్రీ పాస్ కావాలి. అలానే పదో తరగతి సంబంధిత భాషలో చదివి ఉండాలి. అలానే రెండేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి.

అభ్యర్థుల వయస్సు 30 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ఏడో పే కమిషన్‌లో లెవెల్ 7 పే స్కేల్ వర్తిస్తుంది. అంటే రూ.44,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,42,400 వేతనం లభిస్తుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ లో తెలుసుకోవచ్చు. https://upsconline.nic.in/ నుండి అప్లై చేసుకోవాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news