ఇకపై కరోనా మందుకి డబ్బులు వసూలు.. ప్రభుత్వమే కారణం అంటున్న ఆనందయ్య.

-

ఆనందయ్య కరోనా మందు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో కరోనాను నయం చేసే మందు అంటూ అమాంతం వెలుగులోకి వచ్చిన ఆనందయ్య మందుకు అనేక చిక్కులు ఎదురవుతున్నాయట. మందును పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించట్లేదని, తనను నిర్భంధించేందు ప్రయత్నించిందని, ఆ తర్వాత కోర్టు అనుమతి తెచ్చుకున్నాక మందు పంపిణీ ప్రారంభించానని తెలిపారు.

అయినా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఉచితంగా మందు ఇస్తున్నందున ఆర్థిక సమస్యలు ఎక్కువ అయ్యాయని, అందువల్ల ఇకపై కరోనా మందు ఉచితంగా ఉండే అవకాశం లేకపోవచ్చని, ప్రభుత్వ సహకారం ఉంటే ఇలా జరగదని, సాయం అందకపోవడం వల్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఆనందయ్య మాట్లాడారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే బాగుంటుందని అన్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news