పునీత్ మృతి : బెంగళూరు బయలుదేరిన బాలయ్య, ఎన్టీఆర్‌

-

కన్నడ పవన్‌ స్టార్‌ పునీత్ రాజ్‌ కుమార్‌ నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. కన్నడ ఇండస్ట్రీలో దేవుడిగా కొలిచే రాజ్ కుమార్ తనయుడు.. పునీత్ రాజ్కుమార్ ఇక లేడన్న విషయం ఆయన అభిమానులను శోకసంద్రం లోకి నెట్టింది. జిమ్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిన పునీత్.. చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మరణించారు. 46 సంవత్సరాల వయసులోనే ఆయన మృతి చెందడం చిత్ర పరిశ్రమను కుదిపేసింది.

ఇక ఆయన భౌతిక ఖాయాన్ని చూడటానికి… చూడటానికి దేశంలోని ప్రముఖులు వస్తున్నారు. ఇక ఇటు పునీత్ రాజ్ కుమార్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించనున్నారు తెలుగు సినీ ప్రముఖులు.

ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి బెంగుళూరు బయలు దేరారు టాలీవుడ్‌ హీరో, హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ. అలాగే…. మధ్యాహ్నం బెంగుళూరు వెళ్లనున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఇవాళ సాయంత్రం కంఠీరవ స్టేడియానికి మెగాస్టార్ చిరంజీవి కూడా వెళ్లనున్నారు. కాగా.. అమెరికా నుంచి పునీత్‌ కూతురు వచ్చాకనే… ఆయన అంత్యక్రియలు జరుగనున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news