నేటి నుంచి KA పాల్‌ యాత్ర…”పాల్ రావాలి, పాలన మారాలి” పేరుతో !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బాగు కోసమే పాల్ రావాలి, పాలన మారాలి పేరుతో ఇవాళ్టి నుంచి యాత్ర చేస్తున్నారు కే ఏ పాల్ ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు. ఇవాళ్టి నుంచి 13జిల్లాలో రోడ్ షో నిర్వహిస్తాను….రాష్టాన్ని లక్షల కోట్లు అప్పుల్లో ముంచినందుకు చంద్రబాబు, జగన్ లకు భారతరత్న ఇవ్వాలని సెటైర్లు వేశారు.

చంద్రబాబు అవినీతిపై కొన్ని ఆధారాలతో సహా సీబీఐకి పిర్యాదు చేసాను..తన కొడుకు కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఫైర్‌ అయ్యారు. కనీసం రాజధాని కూడా నిర్మించలేక పోయారు..ప్రత్యేక హోదాను చంద్రబాబు ఎందుకు తేలేకపోయారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు హోదాను కాకుండా ప్యాకేజికి అంగీకరించారు… అప్పుల రాష్ట్రాన్ని చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పగించారన్నారు. కొద్ది నెలల క్రితం దేశంలో శ్రీలంక తరహా ఆర్ధిక పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఏర్పడింది…విదేశీ అప్పులతో బయటపడిన ప్రమాదం మాత్రం తప్పిపోలేదని మండిపడ్డారు కే ఏ పాల్ ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు.

Read more RELATED
Recommended to you

Latest news